Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

చిన్నంబావి తహసీల్దార్ కార్యాలయం ముందు 8వ రోజు సమ్మె

ప్రజా గొంతుక/ చిన్నంబావి

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల పర్మినెంట్, కనీస వేతనం తదితర డిమాండ్స్ పరిష్కరించాలని citu, సంఘాల అధ్వర్యంలో ఈనెల సెప్టెంబర్ 11 నుండి రాష్ట్రం లో నిరవధిక సమ్మె ప్రారంభము అయుంది .సమ్మె లో 8వ రోజు చిన్నంబావి తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేస్తుండగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షురాలు అటువైపు నుండి వెళ్తుండగా అంగన్వాడి టీచర్లు ఆయాలు వాహనాన్ని అడ్డగించి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆమెతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆమెకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది KCR ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి అధికారులు అంగన్వాడీ లను భయబ్రాంతులకు గురీ చేస్తూ పరిపాలన చేస్తున్న KCR కి బుద్ధి చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.

పోరాడే సంఘాలను చర్చలకు పిలవక పోవటం అప్రజాస్వామికం. మళ్ళీ పాత పద్ధతి లోనే అంగన్వాడీ ఉద్యోగులను మోసం చేస్తూ ఐసిడిఎస్ మంత్రి హామీలు సమస్యలను పరిస్కారం చేయక పోగా మరింత అసంతృప్తినీ పెంచింది. అని అన్నారు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు

 

*కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ* సెప్టెంబర్ 12 icds మంత్రి సత్యవతి రాథోడ్ గారు అత్యంత దుర్మార్గమైన పద్దతినీ అనుసరించి పోరాటంలో లేని సంఘాలతో చర్చలు జరిపింది. అతి ముఖ్యమైన డిమాండ్స్ పర్మినెంట్, కనిసవేతనం, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు తదితర ముఖ్యమైన డిమాండ్స్ ను ఏవి కూడా ప్రస్తావించలేదు.

 

బతికి ఉన్నప్పుడు కావాల్సిన సౌకర్యాలను కల్పించకుండా ఆ డిమాండ్స్ ను పక్కన పెట్టి కేవలం చనిపోయిన తర్వాత దాహన సంస్కారాలు నిర్వహించడానికి టీచర్లకు 20 వేలు, ఆయాలకూ 10 వేలు ప్రభుత్వం నిర్ణయం చేయడం దుర్మార్గం. ఇందులో కూడా టీచర్లకు, ఆయాలకు అమౌంట్ లో వ్యత్యాసం చూపించటం సరైంది కాదు. ఇద్దరికి సమానంగా నిర్ణయం చేయాలి.

ఇన్సూరెన్స్ 2 లక్షలు అన్నారు కానీ go రాలేదు. మినీ వర్కర్ల సర్కులర్లో మినీలను మెయిన్ టీచర్స్ గా నియామకం, హెల్పర్ల నియామకం పైన స్పష్టత లేదు. షరతులు అనే అంశం మినీ టీచర్స్ కు ప్రమాదకరంగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మళ్లీ పాతదే ప్రకటించారు.

మొత్తానికి మంత్రిగారి చర్చలు అప్రజాస్వామికంగా జరిగాయి. మళ్లీ అంగన్వాడి ఉద్యోగుల్ని మోసం చేసే విధంగా హామీలు ఇచ్చారు. ఈ మోసపూరిత విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

పోరాడే సంఘాలను చర్చలకు పిలిచి సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని, లేనట్లయితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమం , అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.