Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

దేవరకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ దేవరకొండ

ప్రజా గొంతుక సెప్టెంబరు 17 దేవరకొండ జిల్లా నల్గొండ

 

నియోజకవర్గం కన్వీనర్ చిట్యాల గోపాల్ ఆధ్వర్యంలో.పెరియర్ రామస్వామి నాయకర్ 144వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న పాల్గొన్నారు

 

ఆయన మాట్లాడుతూ నాస్తిక వాది హేతువాది జాతీయవాది స్వతంత్ర సమరయోధుడు హిందూ మత విశ్వాసాలను రామాయణ గాధను మూఢనమ్మకాలను బలంగా వ్యతిరేకించిన సంఘసంస్కర్త పెరియర్ రామస్వామి ఆయన మూఢనమ్మకాల మీద ప్రజలను చైతన్యపరిచే విధంగా చాలా గొప్పగా సంబోధించేవారని ఆయన కొనియాడారు

 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బర పటి వెంకటయ్య. జిల్లా నాయకులు నాయకులు ధర్మాపురం శ్రీను కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.