బీజేపీ కార్యకర్త కుటుంబానికి బియ్యం వితరణ చేసిన
— బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప
ప్రజాగొంతుక న్యూస్/జనగామ రూరల్:
మండలం లోని చీటకోడూరు గ్రామ బిజెపి కార్యకర్త కూకట్ల చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోగా కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బెజాడి బీరప్ప మానవత్వం చాటుకుని బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారు తిరుపతి యాదవ్,బూత్ అధ్యక్షుడు రావుల రఘు గౌడ్,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లబోయిన రాజేష్ యాదవ్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.