రికార్డ్ స్థాయిలో రక్తదాన కార్యక్రమం
ప్రజా గొంతుక న్యూస్ /పెద్దపల్లి
ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు పోలీస్ శాఖ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో రికార్డు స్థాయిలో 6,166 మంది రక్తదానం చేశారని పెద్దపెల్లి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ కళాశాల మైదానంలో పెద్దపెల్లి సబ్ డివిజన్ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ప్రారంభించారు.
దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 6,166 మంది రక్తం దానం చేశారని, ఇంత పెద్ద మొత్తంలో బ్లడ్ డొనేషన్ గతంలో ఎక్కడా జరగనందున వివరాలను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదుకు పంపుతున్నట్లు కావేటి రాజగోపాల్ ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ రక్తదాన శిబిరంలో ఏడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు లు, 14 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఈరోజు సమీకరించిన రక్త యూనిట్లను తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసిపి ఎడ్ల మహేష్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి శ్రీనివాస్, పెద్దపెల్లి జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్ వైస్ చైర్మన్ తుమ్ రవీందర్ వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు శ్రీకాంత్, జిల్లా సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.