పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం
ప్రజా గొంతుక సెప్టెంబరు 21 దేవరకొండ జిల్లా నల్గొండ
-అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
-అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు
– నిరుపేదలకు దక్కలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన
– సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు
-దేవరకొండ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకురావడం జరిగింది అని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో చింతపల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ 25 ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుంది అని అయన అన్నారు.ఆత్మగౌరవ లోగిళ్లు… మన డబుల్ బెడ్ రూం ఇండ్లు అని ఆయన తెలిపారు.అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని ఆయన అన్నారు.
గత ప్రభుత్వాలు, ఇరుకు గదులు, ఇబ్బందులతో కూడిన నిధులు, అతి తక్కువ వ్యయంతో అరకొర వసతులతో ఇచ్చిన ఇండ్లు కాకుండా, సిఎం కెసిఆర్ తెలంగాణలోని నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వమే సొంతంగా నిర్మించి, లబ్ధిదారులకు అప్పగిస్తున్నదని ఆయన అన్నారు. ఇలా ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిరుపేదల పక్షపాతిగా పని చేస్తుంది అని ఆయన తెలిపారు.
అభివృద్ధి-సంక్షేమాలే రెండు కండ్లుగా కెసిఆర్ పాలన సాగిస్తున్నారని అని అన్నారు.పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం అమలు చేయడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఇండ్లకు 40 వేలు మాత్రమే ఇచ్చేవారు,అవి బెస్ మెంట్ పనులకే సరిపోయేవి అని ఆయన పేర్కొన్నారు.అప్పుడు ఇండ్లు కడితే అప్పులపాలు అయ్యేవారు,చివరకు ప్లాట్లు కూడా అమ్మేవారు అని ఆయన తెలిపారు.నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ దక్కలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన అన్నారు. సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్య సాగర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నట్వ గిరిధర్,ప్రదాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్ రావు,దండెకార్ ప్రసాద్,ఎల్లంకి అశోక్, అంజి బాబు, తదితరులు పాల్గొన్నారు.