Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

కాంగ్రెస్. అవకాశం ఇస్తే గెలిచి బహుమానంగా అందిస్తా

డాక్టర్ రాజా రమేష్

*పార్టీ పార్లమెంట్ ఇంఛార్జి మోహన్ జోషి కి నియోజకవర్గ స్థితి గతులను వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్*

 

 

ప్రజా గొంతుక న్యూస్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ.అవకాశం కల్పిస్తే గెలిచి బహుమతిగా అందిస్తాను అని డాక్టర్ రాజా రమేష్ .పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి మోహన్ జోషి కి తెలిపారు.

 

సోమవారం కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి మోహన్ జోషి ని పెద్దపల్లి లో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ బలోపేతం పై, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తాను అని, పార్టీలో చేరక ముందు నుండే నియోజకవర్గంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేశాను అని తెలిపారు.

 

అధికారం కోసం కాకుండా ప్రజా సేవ ముఖ్యమని, నియోజకవర్గం లో ప్రజల సమస్యలను పరిష్కరించాలని భావించి రాజకీయాల్లోకి రావడం జరిగింది అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానని, ఉద్యోగం నిర్వర్తించే సమయంలో చెన్నూరు నియోజకవర్గం లోని ప్రజలు పడుతున్న కష్టాలను, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ అరాచకాలను చూసి తట్టుకోలేకపోయాను అని, సుమన్, బిఆర్ఎస్ నిరంకుత్వానికి భరించలేక

 

ఉన్నతమైన కొలువును వదిలి అరాచక పాలనకు వ్యతిరేకంగా గొంతేత్తడం జరిగింది అని తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పార్టీ శ్రేణులు పార్టీ గెలుపును బలంగా కోరుకుంటున్నారు అని, అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ఆరా తీయడం జరిగింది అని అన్నారు. పార్టీలో విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాను అని, ప్రజల్లో ఆదరణ పొందిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థి గా అవకాశం కల్పించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.