దైవభక్తితో గుడి నిర్మాణానికి విరాళం
అందించిన ఇమ్మడి చైతన్య జితేందర్ రెడ్డి దంపతులు
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కే సి రెడ్డి పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప గుడికి ఇమ్మడి చైతన్య జితేందర్ రెడ్డి విరాళం అందించారు. ఈరోజు గుడికి కడప ఏర్పాటు కార్యక్రమం ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరై గుడి నిర్మాణానికి తనవంతుగా విరాళంగా
10,116/- విరాళం ఇమ్మడి చైతన్య జితేందర్ రెడ్డి దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.