Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యులను కలసి పరామర్శించిన

 

జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ .ఎస్.మహేందర్

 

మెదక్ ప్రజా గొంతుక న్యూస్

 

తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ ఆదేశానుసారం పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు మెదక్ జిల్లా పరిధిలోని మెదక్ పట్టణం లో గల “అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను ” జిల్లా అదనపు ఎస్.పి.అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ పరమర్శించడం జరిగింది.

 

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను కలిసి అమరుల ఫోటోలకు పూలమాల లు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులతో ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైన ప్రభుత్వం నుండి సహకారం కావాల్సిన ఇంకా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నను తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని వారి బాగోగులు పర్యవేక్షిస్తామని తెలిపారు. వారి కుటుంబాలకు ఎల్లవెలల సహాయ సహకారాలు అందిస్తామని మరియు సమస్యలు ఉన్న యెడల పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావలసిందిగా కోరడము జరిగింది.

ఈ కార్యాక్రమంలో మెదక్ పట్టణ సీఐ. శ్రీ.వెంకట్ మెదక్ పట్టణ ఎస్.ఐ. శ్రీ. పోచయ్య లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.