Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

తడ్కల్లో” బీఆర్ఎస్ లో చేరికలు జోరు”

– మంత్రి ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరికలు

కంగ్టి, సెప్టెంబర్ 19, ప్రజా గొంతుక న్యూస్:-

 

సంగారెడ్డి జిల్లా నూతన తడ్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో వలసలు జోరుగా కొనసాగుతున్నాయని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ , బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంగారం, ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి, జడ్పిటిసి కోట లలిత ఆంజనేయులు సర్పంచ్ గడ్డపు మనోహర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రమేష్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.