ఎన్ హెచ్ ఆర్ సి బచ్చన్నపేట మండల మండల అధ్యక్షులు గా ఇజ్జగిరి చంద్ర శేఖర్ .
నియామక పత్రాన్ని అందజేసిన – జనగాం జిల్లా అధ్యక్షులు మిన్నలాపురం జలందర్
ముఖ్య అతిధి గా సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్/ బచ్చన్నపేట మండలం :
జనగాం బచ్చన్నపేట మండలం జాతీయ మానవ హక్కుల కమిటీ మండల అధ్యక్షులు గా ఇజ్జగిరి చంద్ర శేఖర్ ని, నియమిస్తూ జిల్లా అధ్యక్షులు మిన్నలాపురం జలందర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఎన్ హెచ్ ఆర్ సి సంస్థ అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం, లీగల్ ప్రొసీజర్ తో మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికి నిస్వార్ధంగా పని చేస్తుందన్నారు.
తధనంతరం నూతనంగా ఎన్నికైన ఇజ్జగిరి చంద్ర శేఖర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు ఈ పదవి ఇచ్చిన జిల్లా అధ్యక్షులు మిన్నలాపురం జలంధర్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఎన్ హెచ్ ఆర్ సి సంస్థలో సభ్యునిగా పేద ప్రజల పక్షాన ముందుండి, జిల్లా అధ్యక్షునికి ఎల్లవేళలా సహకరిస్తూ సంస్థ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తామన్నారు.