Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

తండాలను గ్రామ పంచాయితీలుగా తీర్చిదిద్దిన ఘనత కే సీ ఆర్ దే

 

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

 

 

వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిధిలో నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం నెక్కొండ మండల అజ్మీరా మంగ్యా నాయక్ తండా యువతతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాణా ప్రతాప్ రెడ్డి పెద్దన్న గెలుపే లక్ష్యంగా యువతకు దిశానిర్దేశం చేసిన నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ,అభివృద్ధి లో రాష్ట్రములో ముందు వరసలో ఉండే పెద్ది సుదర్శన్ రెడ్డి నే గెలిపించుకోవాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు.

60 యేండ్లల్లో ఏ నాయకుడు చెయ్యని అభివృద్ధి పనులను 5 యేండ్లలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టిన ఘనత పెద్ది కే

దంక్కుతుంది అజ్మీర మంగ్యా నాయక్ తండాలో 1కోటి 50 లక్షల అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణం.

ఈ ప్రాంత అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక పెద్దన్నకు మాత్రమే ఉందని అందుకే ప్రతి ఒక్క యువకుడు పెద్దన్న గెలుపుకై ఒక సైనికుడిలా పని చేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించుకోవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు మేకల వంశీ కృష్ణ యాదవ్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈదునూరి రమేష్ ,

గ్రామ సర్పంచ్ మాలోత్ సరోజన- వెంకట్ , ఉప సర్పంచ్ సపావత్ మురళి , సొసైటీ డైరెక్టర్ బానోత్ వీరన్న , వార్డు సభ్యులు అజ్మీర సుమన్ , పార్టీ అధ్యక్షులు బానోత్ ప్రవీణ్ , యూత్ అధ్యక్షులు భూక్యా మోహన్ , యూత్ సభ్యులు మాలోత్ దేవేందర్ , బానోత్ శ్రీను , బానోతు సురేందర్ , బానోతు వినోద్ , బానోతు వెంకన్న, భూక్యా రవి , గుగులోతు గణేష్, బానోతు కిషన్, గుగులోత్ గణేష్, గుగులోతు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.