Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

సుల్తానాబాద్ మండలంలో ఇటుక లారీ బోల్తా ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి


ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్

ఇటుక లారీ బోల్తా పడి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది.

శనివారం పెద్దపల్లి నుండి కరీంనగర్ కు ఇటుకలోడు తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అటువైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు లారీ కిందపడి శివపల్లి గ్రామానికి చెందిన అమ్ముల బుచ్చయ్య (65) మృతి చెందాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సిఐ జగదీష్,ఎస్సై విజయేందర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.